కడపజిల్లా పర్యటనకు బుధవారం విచ్చేయుచున్న, జాతీయ తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యదర్శి, యువ నేత నారా లోకేష్ దేవుని కడప కు సాయంత్రం 4: 00 గంటలకు విచ్చేయుచున్నారని బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువనేత కె. రితీష్ రెడ్డిలు తెలిపారు. కావున బద్వేలు ప్రాంతం నుండి తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ లోకేష్ పర్యటనకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అలాగే నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేసేందుకు అందరూ సంసిద్ధమై బయలుదేరాలని బద్వేల్ మున్సిపాలిటీ టిడిపి అధ్యక్షులు జి. వెంగళరెడ్డి, రూరల్ అధ్యక్షుడు బి. రవి కుమార్ రెడ్డి, కె. వి సుబ్బారెడ్డి, మైనార్టీ నాయకులు జహంగీర్ భాష, పోరుమామిళ్ల టిడిపి అధ్యక్షులు బైరవ ప్రసాద్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రంతు తదితరులు పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa