ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే నెలలో సికింద్రాబాద్‌ నుంచి చెన్నైకి వెళ్ళే వందే భారత్‌ రైలు ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 29, 2023, 09:04 PM

ఇటీవల కేంద్రం తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైలును కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడేలా రైల్వే శాఖ మరో వందే భారత్ రైలును కేటాయించింది. వచ్చే నెలలో సికింద్రాబాద్‌ నుంచి చెన్నైకి వందే భారత్‌ రైలు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయల్ రన్‌లో ఈ రైలు చెన్నై నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు గూడూరు చేరుకుంది. అక్కడి నుంచి బయలుదేరి 5.20 గంటలకు ఒంగోలు చేరుకుంది. 6.25 గంటలకు చేర్యాలకు, 8.25 గంటలకు విజయవాడకు చేరుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa