జాతిపిత మహాత్మా గాందీ వర్ధంతిని పురష్కరించుకొని విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె. కె రాజు సూచనలు మేరకు ఉత్తర నియోజకవర్గ శ్రేణులు ఆధ్వర్యంలో సోమవారం జాతిపిత మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతదేశాన్ని బానిసదేశంగా ఏలిన బ్రిటిష్వారు వెన్నులో వనుకు పుట్టించి చివరికి వారిచేతే కాకుండా ప్రపంచ దేశాలతోనే కొనియాడబడిన జాతిపిత మహాత్మా గాందీ ఆశయ సాధనకు మనందరం కృషిచేయాలని ఆన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, స్టాండింగ్ కమిటీ మెంబర్ సారిపిల్లి గోవింద్, కార్పొరేటర్లు కె. అనిల్ కుమార్ రాజు, రెయ్యి వెంకటరమణ, కె. కామేశ్వరి, కె. వి. యన్ శశికళ, వార్డు అధ్యక్షులు పైడి రమణ, కె. వి బాబా, డైరెక్టర్ రాయుడు శ్రీనివాస్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa