ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కడప జిల్లాకు చెందిన నంది మండలం విజయ సుశీల్ కుమార్ 1519 ఓట్లతో గెలిచారు. జాతీయ యువజన కాంగ్రెస్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సోమవారంతో పూర్తయ్యాయి. వివరాలను యువజన కాంగ్రెస్ యాప్ లో పొందుపరిచారు. గత రెండు నెలల నుంచి నిర్వహించిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చాలా మంది పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు అనంతరం విజేతల పేర్లను ప్రకటించారు. అందులో భాగంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గెలవడం జరిగింది. ఈ సందర్భంగా నంది మండలం విజయ్ సుశీల్ కుమార్ మాట్లాడుతూ రాబోవు 2024 ఎన్నికలలో మా నాయకులు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa