కొత్తవలస-కిరండో ల్ రైల్వే లైన్ లో గురు వారం ఉదయం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో విశాఖపట్నం నుంచి బొర్రా, అరకు మధ్య నడిచే పాసింజర్ రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ గూడ్స్ రైలు కిరండోల్ లైన్ లో 7 వ నెంబర్ టన్నెల్ నుంచి శివలింగపురం యార్డ్ లోకి వస్తుండగా ఒక సారి 8 బోగీలు పట్టాలు తప్పినట్టు రైల్వే అధికారులు గుర్తించారు. ఈ సంఘటన పై రైల్వే శాఖ దర్యాప్తు ప్రారంభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa