ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతివిద్యార్థి లక్ష్యంతో చదవాలి: కలెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 09, 2023, 03:49 PM

ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రుల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ అన్నారు. గురువారం తాడిమర్రి మండలంలోని జేవీఎం ఆర్డీటీ పాఠశాలను ఆయన పరిశీలించారు మాజీ డీజీపీ జేవీ రాముడు ఆధ్వర్యంలో వారి తండ్రి వెంకటయ్య పేరుమీదుగా నిర్వహిస్తున్న పాఠశాలలోని విద్యార్థులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు సమాజసేవపై అవగా హన కల్పించాలని టీచర్లను కోరారు. ప్రతి విద్యార్థి రోజు వారి ప్రణాళికను తయారు చేసుకుని చదివి ఉత్తమ ఫలితాలు సాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ విజయలక్ష్మీ, పాఠశాల సిబ్బంది జోసప్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa