ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధిక ధరలతో సామాన్యుల జీవితం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 16, 2023, 01:27 PM

కృష్ణాజిల్లా విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో  భారతదేశ ఆర్థిక వ్యవస్థ మేడిపండు చందంగా ఉందని, 75 ఏళ్ల అమృతోత్సవ సంబరాలు జరుగుతున్నాయని, దేశ ప్రజల జీవన వికాసంలో ఎలాంటి మార్పులు జరగడంలేదని ప్రొగ్రెసివ్‌ ఫోరమ్‌ ప్రతినిధి బుడ్డిగ జమీందార్‌, వీక్షణం సంపాదకుడు ఎన్‌.వేణుగోపాల్‌ ఆవేదన వ్యక్తంచేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో సంపన్నులు మరింత సంపన్నులుగా మారుతున్నారని.. పేదలు, శ్రామికులు మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారని తెలిపారు. జీఎస్టీ విధానంతో పెరిగిన అధిక ధరలతో సామాన్యుల జీవితం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందన్నారు. ఉద్యోగుల వేతనాల్లో కోత మొదలైందన్నారు. జాతీయ సంపద పెరిగిందని ఒక వైపు చెబుతున్నా వేతన జీవుల ఆదాయం మరింత దిగజారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ దేశం ఏవరి చేతుల్లో ఉంది.. ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నది ఇటీవల జరిగిన పరిణామాలు, ఆదానీ విషయం తెటతేల్లం చేశాయన్నారు. ఆదానీ దేశంలోని అన్ని సహజ వనరులపై దృష్టి పెట్టారని, ప్రభుత్వ రంగ సంస్ధలపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa