అమెరికా, దక్షిణ కొరియాలపై ఉత్తరకొరియా దేశాధినేత అగ్గిమీదగుగ్గిలమయ్యారు. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షతో మరోసారి అమెరికా, దక్షిణ కొరియాలకు ఉత్తర కొరియా హెచ్చరికలు పంపింది. అమెరికా, సియోల్లకు హెచ్చరికగా అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్టు నిర్వహించామని ఆదివారం తెలిపింది. విజయవంతమైన, ఆశ్చర్యకరమైన డ్రిల్.. ప్యాంగ్యాంగ్ అణు సామర్థ్యాన్ని
ప్రదర్శించిందని పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 8 గంటలకు అకస్మాత్తుగా క్షిపణి ప్రయోగం చేపట్టాలని అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించింది. దీంతో హస్వాంగ్-15 ఖండాంతర క్షిపణిని ప్యాంగ్యాంగ్ విమానాశ్రయం నుంచి శనివారం మధ్యాహ్నం ప్రయోగించినట్టు అధికారిక మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది.
ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగాన్ని శనివారం సాయంత్రం 17.22 గంటలకు చేపట్టినట్టు దక్షిణ కొరియా సైన్యం ధ్రువీకరించింది. ఈ క్షిపణి కూలిపోవడానికి ముందు తమ ప్రత్యేక ఆర్ధిక జోన్ మీదుగా 66 నిమిషాల పాటు ప్రయోగించినట్టు జపాన్ తెలిపింది. తమ విశ్లేషణ ప్రకారం అమెరికా లక్ష్యంగా చేసుకుని ఐసీఎంబీని ప్రయోగించినట్టు ఉందని పేర్కొంది.
అటు, ఈ పరీక్షపై ప్రశంసలు కురిపించిన ఉత్తర కొరియా నాయకత్వం.. ఎటువంటి పరిస్థితుల్లోనైనా శక్తివంతమైన ఎదురుదాడికి సిద్ధంగా ఐసీఎంబీ యూనిట్ వాస్తవ యుద్ధ సామర్ధ్యాన్ని ప్రదర్శించిందని వ్యాఖ్యానించినట్టు కేసీఎన్ఏ చెప్పింది. ‘శత్రు మూకలపై దేశం ప్రాణాంతక అణు ప్రతిదాడి సామర్థ్యానికి ఈ ప్రయోగం వాస్తవ రుజువు’ అని వ్యాఖ్యానించింది.
ఒకవేళ ఉత్తర కొరియా అణు దాడికి దిగితే తిప్పికొట్టడమే లక్ష్యంగా దక్షిణ కొరియా, అమెరికా సంయుక్త విన్యాసాలకు కొద్ది రోజుల ముందు ఈ ప్రయోగం నిర్వహించడం గమనార్హం. అమెరికా-దక్షిణ కొరియా విన్యాసాలపై గతవారం ప్యాంగ్యాంగ్ హెచ్చరించింది. కొరియా ద్వీపకల్పంలో భద్రత క్షీణిస్తోందని, ఇది యుద్ధ సన్నాహాలని ఉత్తర కొరియా అభివర్ణించింది.
ఇదిలావుంటే అమెరికాకు చెందిన అంకిత్ పాండా అనే రక్షణ రంగ నిపుణుడు మాట్లాడుతూ.. ‘శనివారం నాటి ఐసీఎంబీ పరీక్ష ముఖ్యమైంది.. ఎందుకంటే అప్పటికప్పుడు చేపట్టిన చర్య.. సాంప్రదాయ పరీక్ష కాదు, కానీ ఒక కవాతు.. విధమైన ప్రక్రియలను మరిన్ని చూడొచ్చు’ అన్నారాయన. సియోల్లోని యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కొరియన్ స్టడీస్ ప్రొఫెసర్ యాంగ్ మూ-జిన్ మాట్లాడుతూ.. ప్యాంగ్యాంగ్ ముందస్తు ప్రణాళిక లేకుండా అప్రకటిత ఆదేశాలతో ఒక్క పూటలో ద్రవ-ఇంధనంతో పనిచేసే ఐసీఎంబీని ప్రారంభించే సామర్థ్యం ఉన్న వ్యవస్థలున్నట్ుట పరీక్షలో తేలింది అని చెప్పారు. ‘‘దక్షిణ కొరియా, అమెరికా సంయుక్త విన్యాసాలను కొనసాగించాలని భావిస్తున్న తరుణంలో ప్యాంగ్యాంగ్ కఠినంగా స్పందిస్తుందని అనుకుంటున్నాం.. రాబోయే కొద్ది నెలల్లో ద్వీపకల్పంలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించేలా కనిపిస్తోంది’’ అని ఆయన హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa