ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేనతో కలసి ప్రభుత్వం ఏర్పాటుయే ధ్యేయం: సోమువీర్రాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2023, 11:47 PM

మోదీ అంటేనే అభివృద్ధి అని.. మోదీ అంటే అవినీతి రహిత వ్యక్తి అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  అన్నారు. జనసేన పార్టీతో కలిసి 2024 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. మార్చి 13న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో బీజేపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సోము వీర్రాజు మాట్లాడుతూ.. 2014లో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ కోతలు తగ్గాయని తెలిపారు. 


ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎవరు అధికారంలో ఉన్నా, రెండు కుటుంబాల పాలనే నడుస్తుందని సోము వీర్రాజు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి లేని అప్పుల రాష్ట్రంగా తయారైందని.. అంతా అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం పార్టీ శ్రేణులు విస్తృతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.


ఇదిలావుంటే ఏపీలో జరుగుతోన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోయింది. ఫైనల్‌గా ఎన్నికల బరిలో ఉన్నదెవరో తేలిపోయింది. దీంతో అన్ని పార్టీలు ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. బీజేపీ సైతం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం మొదలుపెట్టింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa