ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయ కక్ష సాధింపులతోనే ప్రతిపక్ష నేతలను అరెస్టులు చేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2023, 02:45 PM

 ఉద్యోగులకు జీతాలివ్వలేని వైసీపీకి ఓటడిగే హక్కు లేదని సీపీఎం పేర్కొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే వైసీపీ నాయకులు అధికారాన్ని, పోలీసులను అడ్డుపెట్టుకుని.. అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ....  రాజకీయ కక్ష సాధింపులతోనే ప్రతిపక్ష నేతలను అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి అనర్హులతో ఓటర్ల జాబితాలు తయారుచేసినా, పోలీసులనుపయోగించి నామినేషన్లను దౌర్జన్యంగా ఉపసంహరింపజేసినా ఎన్నికల కమిషన్‌ మొద్దు నిద్రలోనే ఉండటం సరికాదని విమర్శించారు. దొంగ ఓట్ల వివరాలను పేర్లతో సహా ఇచ్చినా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్నికల నిర్వహణ చేతగాకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాలని డిమాండ్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa