ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు డబ్బులు పంపిణీపై మంత్రి ఉషశ్రీ చరణ్ చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె వివాదంలో చిక్కుకొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉషశ్రీ చరణ్ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో.. ఒక్కో ఓటుకు వెయ్యి రూపాయలు పంపిణీపై ఆమె కార్యకర్తలతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒక గ్రామంలో ఇరవై మంది ఓట్లు ఉంటే.. ఇరవై వేలు ఇవ్వండని.. ఆ డబ్బు ఓటర్లకు చేరిందో లేదో.. ఫోన్ చేసి క్రాస్ చేసుకోవాలని ఉషాశ్రీ చరణ్ నేతలకు సూచించడం వివాదాస్పదంగా మారింది.
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలో.. పంచాయతీల వారీగా ఓటర్ల లిస్టు పరిశీలన చేస్తూ.. మంత్రి ఉషశ్రీ చరణ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ ఇష్యూపై.. ప్రతిపక్ష పార్టీల నేతలు భగ్గుమంటున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని.. డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుల పంపిణీకి తెర తీయడం దుర్మార్గమని.. ఓటర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్.. ఉషశ్రీ చరణ్ను మంత్రివర్గం నుంచి తప్పించాలని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa