ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకువస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 12:46 PM

 ప్రస్తుతం తిరుమలలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి తెస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.  ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీతో తిరుమలకు వచ్చే భక్తులు 5 నుంచి 10 నిమిషాల్లోనే గదులు పొందుతున్నట్టు చెప్పారు. దీని ద్వారా గదుల రొటేషన్‌ తగ్గిందన్నారు. ఈ క్రమంలో 12వ తేదీ వరకు గదుల కేటాయింపు ద్వారా అత్యధికంగా రూ.2.95 కోట్లు ఆదాయం లభించిందన్నారు. అడ్వాన్స్‌, కరెంట్‌ బుకింగ్‌లోనూ ఈవిధానాన్నే అనుసరిస్తున్నామన్నారు. సామాన్య భక్తులు గదుల కోసం పేర్ల రిజిస్ర్టేషన్‌ సమయంలో ఎవరి ఫేస్‌ రికగ్నిషన్‌ చేసుకుంటున్నారో, వారే ఉప విచారణ కార్యాలయాల్లో గదులు పొందాల్సి ఉంటుందన్నారు. ఖాళీ చేసే సమయంలో కూడా ఆ భక్తుడు నేరుగా వెళితేనే డిపాజిట్‌ తిరిగి లభిస్తుందన్నారు. ఒకసారి గది పొందిన భక్తుడు 30 రోజుల వరకు తిరిగి పొందే అవకాశముండదన్నారు. వసతి కోసం తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పేర్ల నమోదు కౌంటర్లను ప్రయోగాత్మకంగా త్వరలో సీఆర్వోకు మార్చనున్నట్టు తెలిపారు. వైకుంఠం క్యూంప్లెక్స్‌-2లో భక్తులకు అందించే ఉచిత లడ్డూ పంపిణీలో కూడా ఫేస్‌ రికగ్నిషన్‌ అమలుతో అక్రమాలను అరికడతామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa