ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ,బుధవారం నుండి ప్రారంభం అవుతున్న ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులుకు పరీక్షా కేంద్రాలలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు అనగా త్రాగునీరు, విద్యుత్, వెలుతురు, ఫ్యాన్లు, వైద్య సేవలు, మరుగుదొడ్లు మొదలగు సౌకర్యాలు కల్పించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు మరియు సభ్యులు గొండు సీతారాం తెలిపారు. ఈ రోజు చైర్మన్ మరియు సభ్యులు కలిసి విశాఖ పట్నంలో పరీక్షలు నిర్వహించ బడుచున్న కేంద్రాలను ముందుగా సందర్శించి ఏర్పాట్లును పరిశీలించారు. ఈ సందర్భంగా అప్పారావు మరియు సీతారాం మాట్లాడుతూ పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి విద్యార్దులు ట్రాఫిక్ సమస్యలు ఏదరవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఇవి పునరావృతం కాకుండా ప్రణాళికా బద్దంగా తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ మరియు రవాణా శాఖ అధికారులు కు కమిషన్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ పరీక్షా సమయంలో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలని, ప్రతీ పరీక్షా కేంద్రంలో వైద్య సేవలు అందించడానికి తగిన సిబ్బందిని నియమించాలని , అత్యవసర మెడిసిన్ లను అందుబాటులో ఉంచాలని, అనుమతి లేనిదే ఇతరులను పరీక్షా కేంద్రాల లోపలకు అనుమతించరాధని, మహిళా పోలీస్ సిబ్బంది తరుచుగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో. రీజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంటర్ మీడియేట్ ఎడ్యూకేషన్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa