తిరుమల కొండ పైకి నడిచి వెళ్లే భక్తులకు ఉచిత దర్శనం టికెట్లను త్వరలో ప్రారంభిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా రాజాంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తిరుమలలో భక్తులకు నాలుగంచెల విధానంలో దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి రోజూ వచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. ఇక, టీటీడీ ఆధీనంలో 60కి పైగా ఆలయాలు ఉన్నాయని... వాటి సరసన రాజాం ఆలయం కూడా చేరిందని ఈవో ధర్మారెడ్డి అన్నారు. జీఎంఆర్ కోరిక మేరకు టీటీడీ పాలకమండలి ఆమోదంతో రాజాం బాలాజీ ఆలయం విలీనం చేసుకున్నామని తెలిపారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను త్వరలోనే రాజాం ఆలయంలో భక్తులకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
ఇక, తిరుమలలో ఈ నెల 21వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంటుందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు సర్వదర్శనం ప్రారంభం కానుంది పేర్కొన్నారు. ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు తిరుమలలో ఈ నెల 30వ తేదీన శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం జరగనుందని, 30వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు శ్రీవారు.. హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు. ఈ నెల 31వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం జరిపిస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa