ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పీకర్‌ పట్ల టీడీపీ సభ్యులు దారుణంగా ప్రవర్తించారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 20, 2023, 01:06 PM

ప్రశాంత వాతావరణాన్ని చంద్రబాబు సహించలేడని, అందుకే ప్రజా సమస్యలపై చర్చ జరిగే చట్ట సభలో టీడీపీ సభ్యులతో రోజుకో రచ్చ చేయిస్తున్నాడని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి ధ్వజమెత్తారు. చట్టసభలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు చేసిన సంఘటన బాధ కలిగిస్తోందన్నారు. స్పీకర్‌ పట్ల టీడీపీ సభ్యులు దారుణంగా ప్రవర్తించారన్నారు.  సభ్యులంతా పవిత్రంగా భావించే స్పీకర్‌ చైర్‌ మీద, స్పీకర్‌ మీద దాడి చేయడం హేయమన్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న నాటకం అని చాలా స్పష్టంగా అర్థం అవుతుందన్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa