ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ప్రారంభమైన ఐసెట్ దరఖాస్తు ప్రక్రియ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 20, 2023, 06:56 PM

ఆంధ్రప్రదేశ్ లో ఎంబీఏ, ఎంసీయే కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ఐసెట్. ఈ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 సంవత్సరానికి గాను దరఖాస్తుల ప్రక్రియ నేడు ప్రారంభం అయింది. ఏపీలో ఈ ఏడాది ఐసెట్ పరీక్షను అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఐసెట్ కన్వీనర్ తో పాటు ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా దీనిపై వివరాలు తెలిపింది.


దరఖాస్తులు ఆన్ లైన్ లో చేసుకోవాలి 


మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు దరఖాస్తుల స్వీకరణ 


దరఖాస్తు చార్జీ రూ.650 


బీసీలకు దరఖాస్తు చార్జీ రూ.600 


ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.550 


మే 24, 25 తేదీల్లో ఐసెట్ పరీక్షలు 


రెండు షిఫ్టులలో పరీక్షలు 


ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్ష 


మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష 


మే 20 నుంచి అందుబాటులో హాల్ టికెట్లు 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa