ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.155 లక్షల కోట్లకు చేరిన కేంద్రం అప్పులు

national |  Suryaa Desk  | Published : Tue, Mar 21, 2023, 10:22 AM

కేంద్ర ప్రభుత్వ అప్పులు 2023 మార్చి నాటికి రూ.155.8 లక్షల కోట్లకు చేరినట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఇది జీడీపీలో 57.3% కి సమానమని చెప్పారు. ఇందులో విదేశీ అప్పు రూ.7.03 లక్షల కోట్లని (జీడీపీలో 2.6%) తెలిపారు. లోక్‌సభలో సోమవారం BRS నేత నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు ఆమె ఈమేరకు బదులిచ్చారు. మొత్తం రుణాల్లో విదేశీ అప్పు 4.5% మాత్రమేనని నిర్మలమ్మ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa