ఎస్టీలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు..వారిని నేను కూడా చివరి వరకు అలాగే గుండెల్లో పెట్టుకుంటానని అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ పేర్కొన్నారు. అసెంబ్లీలో బోయ, వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని, దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలనే తీర్మానాను ఆమోదించి కేంద్రానికి పంపుతున్నట్లు సీఎం వైయస్ జగన్ తెలిపారు. ఈ రెండు బిల్లులపై సీఎం వైయస్ జగన్ సభలో మాట్లాడారు. ఈ రోజు సభలో రెండు తీర్మానాలకు సంబంధించి బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాం. ఈ తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నాం. నా సుదీర్ఘ పాదయాత్ర సమయంలో తమకు అన్యాయం జరిగిందని, 70 ఏళ్లుగా ఎస్టీ హోదా కోసం పోరాటం చేస్తున్నామని, తమను ఎస్టీ జాబితాలో చేర్చాలనిబోయ, వాల్మీకి కులాలు విజ్ఞప్తి చేశారు. పక్క రాష్ట్రం కర్ణాటకలోని బళ్లారిలో తమ కులస్తులకు ఎస్టీ హోదా ఉందని, రాయలసీమ జిల్లాల్లో ఉన్న తమకు ఎస్టీ హోదా ఇవ్వలేదని వారు ఎన్నో దశాబ్ధాలుగా చెప్పుకుంటున్నారు. ఈ మేరకు అధికారంలోకి మనం వచ్చిన వెంటనే వీరికి న్యాయం చేసే విధంగా ...ఎస్టీ స్టేటస్ రాష్ట్రం పరిధిలో లేకపోయినప్పటికీ మన చేతనైనంత చేయాల్సిన బాధ్యత, మానవత్వం ప్రతి మనిషిలో ఉండాలి. ఆ మానవత్వంలో భాగంగానే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ కూడా ఇచ్చాం. మనం వచ్చిన తరువాత వీరికి మంచి చేస్తామని మాటిచ్చాం. మేనిపెస్టోలో పేర్కొన్న ప్రకారం బోయ, వాల్మీకిల స్థితిగతులపై అధ్యాయనం చేయించడానికి మన ప్రభుత్వం వన్ మెన్ కమిషన్ను ఏర్పాటు చేశాం. రిటైర్డు ఐఏఎస్ అధికారి శ్యామూల్ ఆనంద్కుమార్ను నియమించాం. ఈ కులస్థులు అధికంగా ఉండే రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, వైయస్ఆర్ జిల్లా, అనంతపురం జిల్లాల్లో ఈ కమిషన్ విస్తృతంగా పర్యటించి ఆ కుటుంబాలపై ఆధ్యాయనం చేసింది. వారి ఆర్థిక స్థితిగతులను పరిశీలించి నివేదిక తయారు చేశారు. ఈ నివేదిక ద్వారా కమిషన్ సిఫార్సు చేసింది. ఈ సిఫార్స్లను పరిగణలోకి తీసుకొని కేంద్రానికి సిఫార్స్ చేస్తూ అసెంబ్లీ ద్వారా పంపుతున్నాం అని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa