ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖలో భార్య..భర్తల మిస్సింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2023, 06:37 PM

విశాఖలోని. వడ్లపూడి తిరుమలనగర్‌లో నివాసం ఉండే చిత్రాడ వరప్రసాద్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి.. ఆయన భార్య మీరాతో కలిసి సెల్ఫీ వీడియో తీసి బంధువులకి కుటుంబ సభ్యులకి పంపించారు. ఆర్థిక ఇబ్బందులు వల్ల ఆత్మహత్య చేసుకుంటామని సెల్ఫీ వీడియో తీసి మొబైల్ స్విచ్ ఆఫ్ చేశారు. విషయం తెలుసుకున్న కుమారుడు సాయితేజ దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


నిన్న సాయంత్రం దంపతులు ఇంట్లోనే ఓ సెల్ఫీ వీడియో తీశారు. ఆర్థిక ఇబ్బందులతో తాము ప్రాణాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తాము వెళ్తున్నామని.. అందరూ జాగ్రత్తగా ఉండండి.. అమ్మ‌మ్మను చూసుకోండి అంటూ వీడియోలో చెప్పారు. 'మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోడి అల్లుడు గారు' అంటూ జాగ్రత్తలు చెప్పారు. 'మీకు (అల్లుడు) ఇవ్వాల్సినవి ఇవ్వలేకపోతున్నాము ఏమీ అనుకోవద్దు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను బాగా చూసుకోండి అంటూ బంధువులకు చెప్పారు.


ఈ వీడియో చూసిన కుమారుడు, బంధువులు వారి కోసం గాలింపు మొదలు పెట్టారు. అయినా వారి ఆచూకీ దొరకలేదు.. అయితే అనకాపల్లి జిల్లాలోని ఏలేరు కాలువ దగ్గర దంపతుల బ్యాగు, దుస్తులు, చెప్పులు లభ్యమయ్యాయి. వెంటనే కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు భార్యాభర్తల కోసం గాలిస్తున్నారు. ఏలేరు కాలువ దగ్గర కూడా వెతికే పనిలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


మరో ఘటనలో కరెంట్ షాక్‌తో మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రమణయ్యపేటకు చెందిన వీర్ల సురేష్‌కూలి పనులకు బయటి ప్రాంతాలకు వెళ్తుండేవాడు. కొత్త అమావాస్య పండగ కావడంతో సురేష్ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఇంటి దగ్గర కొబ్బరి చెట్టు నుంచి బోండాలను ఇనుప చువ్వతో తెంచేందుకు ప్రయత్నించాడు.


అయితే ఆ ఇనుప చువ్వ పట్టుతప్పి పక్కనే ఉన్న కరెంట్ హెచ్‌టీ లైన్‌కు తగిలింది. దీంతో అతడు కిందపడిపోగా.. కుటుంబ సభ్యులు వెంటనే నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు సురేష్‌ను పరిశీలించి.. అప్పటికే చనిపోయాడని తేల్చారు. మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సురేష్‌కు ఏడాదిన్నర కుమారుడు ఉండగా.. ఈ మధ్యే బర్త్ డే చేశారు. సురేష్ మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa