తన చివరి రక్తపు బొట్టు వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోనే ఉంటానని వైసీపీ సన్నపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పష్టంచేశారు . పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని.. కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ దుష్ప్రచారం చంద్రబాబు ఆడుతున్న మైండ్ గేమ్లో భాగమని.. తాను పార్టీ మారే ఉద్దేశం లేదన్నారు. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోయినా.. కోవూరులో వేరే అభ్యర్థికి టికెట్ ఇచ్చినా తాను గెలిపించేందుకు సిద్ధమన్నారు.
తమదిది మొదటి నుంచి రాజకీయ కుటుంబం.. ఇలా దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. తాను ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. మంత్రిగా పనిచేశాను అన్నారు. 2012లో ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి బయటకు వచ్చి కోవూరు నుంచి గెలిచా.. తనను సీఎం వైఎస్ జగన్ ఆప్యాయంగా చూస్తారన్నారు. వాళ్ల ఇంట్లో బిడ్డలా చూసుకుంటున్నారుని.. అలాంటప్పుడు పార్టీ ఎందుకు మారతానో చెప్పాలన్నారు. తన తండ్రి శ్రీనివాసులు రెడ్డి పేరును నెల్లూరు బ్యారేజ్కు పెట్టారని గుర్తు చేసుకున్నారు.
చంద్రబాబు గేమ్ ఆడుతున్నారని.. కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుని పార్టీకి ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. తాను మాత్రం చనిపోయే వరకూ జగన్ వెంటే నడస్తున్నాని కుండబద్దలు కొట్టారు. తాను పార్టీ మారబోతున్నట్లు తప్పుడు ప్రచారం చేయడంతో.. ఎంతోమంది ఫోన్ చేశారన్నారు. జగన్ మళ్లీ సీఎం అయ్యేందుకు తన వంతుగా కృషి చేస్తాను అన్నారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దన్నారు.
కోవూరు ఎమ్మెల్యే పార్టీ మారబోతున్నారని ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో జోరుగా వార్తలొచ్చాయి. ముఖ్యమంత్రి జగన్ తీరుతో ఆయన పార్టీ మారాలనుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. దీంతో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్వయంగా స్పందించారు. తనకు పార్టీ మారాల్సిన అవసరమే లేదని చెప్పారు.
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గతంలో టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత టీడీపీ నుంచి బయటకు వచ్చి వైఎస్ జగన్కు అండగా నిలిచారు.. అనంతరం జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ నుంచి విజయం సాధించారు. 2014లో ఆయన టీడీపీ అభ్యర్థి పోలంరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2019లో పోలంరెడ్డిపై విజయం సాధించారు.. సీనియర్ కావడంతో మంత్రి పదవి వస్తుందని భావించారు.. కానీ ఆ ఛాన్స్ దక్కలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa