సినిమాల్లోనే కాదు ట్విస్ట్ ల పర్వం నిజజీవితాల్లో కూడా దర్శనమిస్తాయి. కడపలో ఓ మహిళ భర్తకు ట్విస్ట్ ఇచ్చింది. ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ అందర్నీ పరుగులు పెట్టించింది. ఆమె ఆచూకీ కోసం వెతకగా.. ఈ మిస్సింగ్ మిస్టరీ చివర్లో ఊహించని మలుపు తిరిగింది. సీకే.దిన్నె మండలం చెర్లోపల్లెకి జరినాకు భర్త అక్బర్తో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల 27న ఆమె భర్తను బెదిరించడానికి ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. నేరుగా కడప మోచంపేటలోని తన పుట్టింటికి వెళ్లింది.
అత్తింటికి వెళ్లిందని అక్బర్ కూడా పట్టించుకోలేదు. ఇంతలో ఆమె పుట్టింటి నుంచి అదృశ్యమైంది. వెంటనే జరీనా తల్లి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. జరీనా రెండు రోజులు మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఆమె ఆచూకీ కనిపెట్టడం ఇబ్బందిగా మారింది. తర్వాత ఆమె మొబైల్ ఆన్ చేయగానే సిగ్నల్స్ ఆధారంగా బెంగళూరులోని బంధువుల ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు బెంగళూరు వెళ్లి ఆమెను తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. జరీనా భర్తను బెదిరించడానికే ఇంటి నుంచి వెళ్లినట్లు పోలీసులకు చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు.
మరోవైపు జమ్మలమడుగులో విషాద ఘటన జరిగింది. బస్సు టైరుకు గాలి నింపే క్రమంలో జరిగిన ప్రమాదంలో యువకుడు చనిపోయాడు. పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డులో బాలయ్య గాలి నింపే షాపులో పనిచేస్తున్నాడు. ఆ షాపు యజమాని బస్సు టైర్ గాలికి నింపుతున్నాడు.. వేరే పని ఉండటంతో ఆ టైరును చూడలేదు. ఈ క్రమంలో ఒక్కసారిగా టైరు పేలడంతో పక్కనే నిలబడి ఉన్న బాలయ్యపై ఎగిరిపడింది. ఈ ఘటనలో అతడి తలకు బలమైన గాయాలు తగిలాయి. అతడ్ని వెంటనే ఆస్పత్రికిత తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. బాలయ్యకు తల్లిదండ్రులు లేరు.. నానమ్మ దగ్గర ఉంటున్నాడు.
మరోవైపు లోకాయుక్త పేరుతో ఉన్నతాధికారులను బెదిరించి, డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గుర్ని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కడపకు చెందిన నాగేశ్వరరెడ్డి, బుచ్చుపల్లి వినీత్కుమార్, శివకుమార్లపై బెంగళూరు, హైదరాబాద్. అనంతపురం ప్రాంతాల్లో 32 కేసులు ఉన్నాయి. లోకాయుక్త అధికారినంటూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. వీరిలో నాగేశ్వరరెడ్డికి ఏడు భాషలు మాట్లాడతాడు.. అతడు బెంగళూరులో ప్రభుత్వోద్యోగులను టార్గెట్ చేస్తున్నాడు.. లోకాయుక్త, సీఐడీ అధికారుల పేర్లతో ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడు.
అలాగే ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడప-తాడిపత్రి రోడ్డులో ముద్దనూరు మండలం తిమ్మాపురం దగ్గర వాహనాల తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఓ కారులు సోదాలు చేయగా.. 11 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. దుంగలను తరలిస్తున్న కారును, గొడ్డళ్లను సీజ్ చేశారు. ఈ కేసులో ఒకరు పోలీసులకు దొరకగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa