ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం గోపాలపురంలో శ్రీరామనవమి నాడు కుటుంబ కలహాలతో భార్యను భర్త హత్య చేశాడు. కోటేశ్వరరావు వ్యవసాయ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. భార్య కళ్యాణి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా.. ఒక కుమారుడికి, కుమార్తెకు పెళ్లి చేశాడు. మరో కుమారుడితో కాలనీలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా అతడు మద్యానికి బానిసై భార్య కల్యాణిని వేధిస్తున్నాడు.
కోటేశ్వరరావు బుధవారం రాత్రి మద్యం తాగి వచ్చాడు.. మళ్లీ భార్యతో గొడవకు దిగాడు. ఆ తర్వాత ఇద్దరు ఇంట్లో నిద్రపోయారు.. అయితే భార్యపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కోటేశ్వరరావు వేకువజామున ఆమె నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో నరికాడు.. ఆమె ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత కోటేశ్వరరావు అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు.. వారు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
భార్యను హత్య చేసిన తర్వాత నిందితుడు కోటేశ్వరరావు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే అతడు చివరికి గ్రామానికి సమీపంలోని ఉన్న మామిడితోటలో చెట్టుపై దాక్కున్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి.. మామిడి చెట్టుపై ఉన్న కోటేశ్వరరావును కిందకు దింపారు. ఆ తర్వాత అతడ్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కుటుంబ కలహాలతో భార్యను చంపినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa