ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాట్లాడి ఇస్తానని ఫోన్ తీసుకొని వ్యాపారి ఆకౌంట్ నుంచి డబ్బులు మాయం చేశాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 01, 2023, 09:51 PM

అపరిచితులకు  మీ ఫోన్ ఇచ్చారో మీ అకౌంట్ మాయం కావడం ఖాయం. ప్రకాశం జిల్లాలో ఈ సరికొత్త మోసం బయటపడింది. ఓ అపరిచిత వ్యక్తికి మొబైల్ ఇచ్చిన వ్యాపారి నిండా మునిగాడు. కురిచేడు మండలం కాటంవారిపల్లెకి చెందిన కాటం కృష్ణారెడ్డి ప్రొవిజన్స్ షాపు నిర్వహిస్తుననాడు. ఓ అపరిచిత వ్యక్తి వచ్చి తనకు నిత్యావసర సరుకులు తీసుకున్నాడు. తన దగ్గర డబ్బులు లేవని.. తన స్నేహితుడికి కాల్ చేస్తే.. డబ్బుల్ని ఆన్‌లైన్‌లో పంపుతాడని చెప్పాడు. ఆ పరిచిత వ్యక్తి వ్యాపారికి ఓ ఫోన్‌ నెంబర్‌ ఇచ్చి దానికి ముందుగా ఓ రూపాయి ఫోన్‌ పే చేయమని అడిగాడు.


కృష్ణారెడ్డి తన ఫోన్‌పే నుంచి ఆ ఖాతాకు ఓ రూపాయి పంపాడు. ఆ తర్వాత ఫోన్‌ చేసి స్నేహితుడితో మాట్లాడతానని కృష్ణారెడ్డి మొబైల్ తీసుకున్నాడు. కొద్దిసేపటికి మొబైల్ తిరిగి ఇచ్చి కృష్ణారెడ్డికి మాయమాటలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎందుకో వ్యాపారికి అనుమానం వచ్చింది.. కొద్దిసేపటి తర్వాత కృష్ణారెడ్డి తన ఫోన్‌పేలో నగదు చూసుకోగా రూ.98 వేలు మరో అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు గుర్తించాడు. అతడి కోసం ఆ పరిసరాల్లో చూడగా.. అప్పటికే వెళ్లిపోయాడు.


వెంటనే అకౌంట్ నంబర్ ఆధారంగా వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. ఈ మోసంపై ఇంకా కేసు నమోదు కాలేదు. ఆ అపరిచిత వ్యక్తి కృష్ణారెడ్డి ఫోన్ పే నుంచి రూపాయి పంపించే సమయంలో పాస్‌వర్డ్‌ గమనించి ఉంటాడని భావిస్తున్నారు. ఫోన్ చేసుకుంటానని చెప్పి తీసుకున్న సమయంలో రూ.98 వేలను మరో అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశాడు.


మరో కేసులు ఇద్దరు రాజస్థాన్ కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సంతనూతలపాడుకు చెందిన శ్రీనివాసులు చీమకుర్తి ఆర్టీసీ బస్టాండ్‌ దగ్గర గెలాక్సీ నెట్‌ పేరిట షాపు నిర్వహిస్తున్నాడు. అక్కడ పాస్‌పోర్టు సైజు ఫొటోల ప్రింటింగ్‌తో పాటు డబ్బుల్ని కూడా ట్రాన్స్‌ఫర్ చేస్తుంటాడు. మార్చి 4న రాత్రి పది గంటల సమయంలో ఇద్దరు యువకులు వచ్చి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయమని కోరారు. కానీ వారిచ్చిన ఆధార్ కార్డులతో బ్యాంక్ అకౌంట్ లేదని శ్రీనివాసులు వారికి చెప్పాడు. ఆ ఇద్దరు ఏటీఎం కార్డు ఇచ్చి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలని చెప్పగా.. పిన్ నంబర్ మూడుసార్లు తప్పుగా నమోదు చేశారు.


ఆ తర్వాత ఇద్దరు సడన్‌గా షాపు షట్టర్‌ లోపలి నుంచి మూసివేసి శ్రీనివాసులుపై దాడి చేశారు. కౌంటర్‌లో ఉన్న రూ.15 వేల తీసుకుని పారిపోయారు. బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. పోలీసులు రాజస్థాన్‌‌కు చెందిన సవర్‌ రాం, సాగర్‌ నాయక్‌లు ఈ దోపిడీ చేసినట్లు గుర్తించారు. ఈ నిందితులను చీమకుర్తి తూర్పు బైపాస్‌ రోడ్డులో అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి రూ.15 వేలతో పాటు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరం తర్వాత పోలీసులు అప్రమత్తం అయ్యారు.. జిల్లాలోని పలు ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న కార్మికుల వివరాలు సేకరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa