ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ ట్యాబ్ లు పనిచేయడంలేదా...అయితే డోంట్ వర్రీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 06, 2023, 06:37 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు అందజేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఒకవేళ ప్రభుత్వం పంపిణీ చేసిన ట్యాబ్‌లలో సమస్య వస్తే వాటిని పరిష్కరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ట్యాబ్‌లలో ఏదైనా సమస్య వస్తే విద్యార్థులు ఇబ్బందిపడతారని భావించిన సర్కార్.. వాటిని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు.


ఈ ట్యాబ్‌ల సర్వీస్‌కు సంబంధించి సచివాలయంలో వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు, వార్డు ఎడ్యు కేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీలను పర్యవేక్షణ కోసం నోడల్‌ అధికారులుగా నియమించారు. అంతేకాదు ఈ ట్యాబ్‌ల సర్వీస్‌కు సంబంధించి పర్యవేక్షణకు ఓ ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను కూడా సిద్ధం చేసింది గ్రామ, వార్డు సచి వాలయాల శాఖ. ట్యాబ్‌ రిపేర్‌‌కు సంబంధించిన ప్రక్రియపై కలె క్టర్లు, సచివాలయాల జిల్లా కో ఆర్డినేటర్లతో పాటు అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు కూడా జారీ చేశారు.


ఎవరైనా విద్యార్థికి ట్యాబ్‌లో సమస్య వస్తే.. వెంటనే ఆ ట్యాబ్‌ను విద్యార్థి, తలిదండ్రులు, లేని పక్షంలో స్కూల్ టీచర్లు, హెడ్‌మాస్టర్లు ఎవరో ఒకరు తమ సమీపంలోని సచివాలయంలో పనిచేసే వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు, వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీలను కలవాలి. అక్కడ ట్యాబ్ అందజేయాలి.. రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లో ఈ విధానం ఉపయోగించుకునే అవకాశం ఉంది.


విద్యార్థి ట్యాబ్‌ రిపేరుకు సంబంధించిన ప్రక్రియ సమాచారం కోసం ఫోన్‌ నంబర్‌ను కూడా నమోదు ఎంట్రీ చేస్తారు. ట్యాబ్‌ సమస్య పరిష్కారమైన తర్వాత సంబంధిత సచివాలయ సిబ్బందే దానిని సేకరించి.. తిరిగి విద్యార్థికి అందజేయనున్నారు. ఒకవేళ ట్యాబ్ రిపేర్‌కు కుదరకపోతే వారంటీని బట్టి కొత్త ట్యాబ్‌ను సచివాలయ సిబ్బంది సేకరించి విద్యార్థికి అందజేస్తారు ఈ ప్రక్రియపై అవగాహన కోసం రాష్ట్రవ్యాప్తంగా వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు, వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీలకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా 8 వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్థులు, 59,176 టీచర్లకు మొత్తంగా 5,18,740 ట్యాబ్‌లను పంపిణీ చేశారు. బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్తో వీటిని అందించారు. ప్రభుత్వం ఈ ట్యాబ్‌ల కోసం రూ. 1,466 కోట్ల ఖర్చు చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ విప్లవానికి శ్రీకారం చుట్టామని.. అలాగే పేద విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియం, డిజిటల్‌ విద్యను అందిస్తున్నామరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa