విజయవాడ గుణదల సమీపంలో రైల్వే గేటు వేసేలోపే సిగ్నల్ ఇవ్వడంతో రైలు వచ్చేసింది.. అదేస సమయంలో పట్టాలపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.. వెంటనే స్టేషన్ మాస్టర్ అప్రమత్తం అయ్యారు. రైలు లోకో పైలెట్ను అప్రమత్తం చేయడంతో.. ట్రెయిన్ వేగాన్ని తగ్గించారు. అలాగే రైల్వే సిబ్బంది ఎర్రటి బ్యానర్ను పట్టాలపై కట్టారు. అనంతరం గొలుసులతో పట్టాలపై ట్రాఫిక్ క్లియర్ చెయ్యటంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ స్టేషన్ మాస్టర్ అప్రమత్తంకాకుండా ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని.. పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ఇలా జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గత నెల 30న కూడా ఏలూరు జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. భీమడోలు దగ్గర దురంతో ఎక్స్ప్రెస్ బొలేరో వాహనాన్ని ఢీకొట్టింది. రైలు రాకతో గేటు వేయగా.. ఓ బొలేరో వాహనం దూసుకొచ్చింది. రైల్వే గేటును ఢీకొట్టి ట్రాక్పై ఆగిపోయింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి వస్తూ విశాఖవైపు వెళుతున్న దురంతో ఎక్స్ప్రెస్ వచ్చింది.. ఆ వెంటనే వాహనాన్ని అక్కడే వదిలేసిన దుండగులు పారిపోయారు. ఈ క్రమంలో రైలు బొలేరోను ఢీకొట్టింది.. ఈ ఘటనలో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో దురంతో రైలు ఇంజన్ ముందు భాగం కొద్దిగా దెబ్బతింది.
ఈ ఘటన తర్వాత దురంతో రైలు అక్కడే నాలుగు గంటల పాటూ నిలిచిపోయింది.. అలాగే మిగిలిన రైళ్ల రాకపోకలు ఆలస్యం అయ్యాయి. బొలేరో వాహనంలో వచ్చిన వారు గేదెల దొంగలని స్థానికులు చెబుతున్నారు.. వారిని స్థానికులు పట్టుకునే క్రమంలో పారిపోయారని.. ఈ క్రమంలోనే రైల్వే గేటును ఢీకొట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిద్రమత్తులో రాంగ్ రూట్లో వచ్చిన కారు బైక్ను బలంగా ఢీకొట్టింది. కైకలూరు నుంచి విజయవాడలోని గుణదల మేరీ మాత కొండకు దైవదర్శనం కోసం 20 మంది పాదయాత్రగా వెళుతున్నారు. వారిలో నవీన్, అక్షయ్లు యాక్టివా వాహనం మీద పాదయాత్రగా వెళుతున్న వారందరికీ టిఫిన్ ప్యాకెట్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. గుడివాడ విజయవాడ రోడ్డులో డీమార్ట్ దగ్గర రాంగ్ రూట్ లో వేగంగా వచ్చిన కారు యువకుల వాహనాన్ని ఢీ కొట్టింది. సుమారు 100 మీటర్ల దూరం యాక్టివా వాహనంతో పాటు యువకులను ఈడ్చుకు రావడంతో యువకులు తీవ్ర గాయాలు అయ్యాయి. కారు బెలూన్లు ఓపెన్ కావడంతో కారు నడిపే వ్యక్తికి ఎటువంటి గాయాలు కాలేదు. భయంతో అక్కడి నుంచి అతడు పారిపోయాడు.. గాయపడిన యువకుల్ని 108 వాహనంలో గుడివాడ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa