ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రచారం కోసం ప్రయోగం, పళ్ళు రాలకొట్టుకున్న యజమాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 07, 2023, 01:21 PM

మార్కాపురంలోని కోర్టుసెంటర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన బిర్యాని పాయింట్‌కు ప్రచారం కల్పించేందుకు ఓ వ్యాపారి చేసిన వినూత్న ఆలోచన బెడిసికొట్టింది. రూపాయి నోటుకే బిర్యాని ప్యాకెట్‌ అంటూ ప్రచారం చేసి వినియోగదారులను అకట్టుకొనే ప్రయత్నం చేశారు. మార్కెట్‌లో ఎన్ని రూపాయి నోట్లు ఉంటాయో అంచనా వేయలేక ఈ ఆఫర్‌ ప్రకటించారు. ఈ ఆఫర్‌ కూడా కేవలం గురువారం ఒక్కరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు అని ముందుగానే ప్రచారం చేశాడు. దీంతో అలమారాలు, ట్రంకు పెట్టెలో పదిలంగా దాచుకున్న రూపాయినోటుకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఆ నోట్లతో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా బిర్యాని పాయింట్‌ ఎదురు బారులు తీరారు. దీంతో ట్రాఫిక్‌కు కూడా విపరీతంగా అంతరాయం కలిగింది. అయితే అనుకున్నదానికన్నా ఎక్కువ మంది రూపాయి నోట్లతో బిర్యాని కోసం వచ్చారు. దీంతో గంటలోపే బిర్యాని అయిపోయిందని సదరు యజమాని దుకాణం మూసేసి వెళ్లాడు. బిర్యాని దక్కించుకున్న వారు ఆ రుచిని ఆస్వాదించగా, దక్కనివారు నిరాశగా వెనుతిరిగారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa