తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లడంలో నరసన్నపేట నియోజకవర్గం ముందు స్థానంలో ఉందని నరసన్నపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సిమ్మ చంద్ర అన్నారు. ఆదివారం ఉదయం ఆయన మాట్లాడుతూ ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఉత్తరాంధ్ర జోన్ సమావేశంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో ముందంజలో ఉందని ప్రకటించడం కార్యకర్తల్లో ఎంతో ఆనందం నింపిందన్నారు. అలాగే ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు పోలాకి రోడ్ లో ఉన్న ఎస్ ఎల్ వి డి కళ్యాణ మండపంలో ఓటర్ వెరిఫికేషన్ మ్యాపింగ్ శిక్షణ కార్యక్రమం చేపడుతున్నామని ఈ కార్యక్రమానికి కూడా జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి తో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరవుతారని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శిమ్మ చంద్రశేఖర్ తెలిపారు. యూనిట్ ఇంచార్జిలు, క్లస్టర్ ఇంచార్జిలు మరియు బూత్ కన్వీనర్లు, అనుబంధం కమిటీ వారు యువత పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa