ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ అన్నే మా భవిష్యత్తు విజయవంతం చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 09, 2023, 11:51 AM

మైలవరం మండలంలోని 19 పంచాయతీ లలో జగనన్నే మా భవిష్యత్' కార్యక్రమమును విజయవంతం చేయాలనీ మండల వైసీపీ నేత చేరెడ్డి చెన్నకేశవ రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం 3 గంటలకు చేరెడ్డి నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ ముగ్గురు చొప్పున సచివాలయానికి నియమించిన కన్వినర్లు, ప్రతి 50 నుంచి వంద ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమించిన గృహ సారథులతో కూడిన సైన్యం ఈ కార్యక్రమమునకు సంబంధించి వారికి ప్రత్యేకమైన కిట్ బ్యాగ్లు అందచేయడం జరిగిందని 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం


ద్వారా సచివాలయాల పరిధిలో ప్రతి కుటుంబానికి గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు చేస్తున్న మేలును వివరించి. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం విజయవంతం చేయాలనీ వైసీపీ శ్రేణులను కోరారు. ప్రజల సమస్యలు తెలుసుకొని ఎంపిపి ద్రుష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కరానికి తప్పకుండ కృషి చేస్తామని హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa