ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రవాదాన్ని అంతం చేసిని ప్రధాని నరేంద్రమోడీ.... అమిత్ షా

national |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2023, 08:41 PM

ఉగ్రవాదాన్ని అంతం చేసిన ఘటన ప్రధాని నరేంద్రమోదీది అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు.  అమిత్ షా అసోంలో పర్యటిస్తున్నారు. దిబ్రూగఢ్ బీజేపీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి షా మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన ఘనత ప్రధాని మోదీదే అని స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదాన్ని అంతం చేసి.. అభివృద్ధిని వేగవంతం చేశారని వివరించారు. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో 50 సార్లు పర్యటించి.. అనేక రకాల పథకాలు తీసుకొచ్చారని అమిత్ షా గుర్తుచేశారు.


అంత మంచి పనులు చేసిన ప్రధానిపై కాంగ్రెస్ నేతలు ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని కోసం ఈ కాంగ్రెసోళ్లు సమాధి తవ్వుతారట అని ఫైర్ అయ్యారు. 'మోదీ తేరీ కబ్ర్ ఖుదేగీ' కామెంట్స్‌పై అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు ప్రధాని మోదీ దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిస్తున్నారని వ్యాఖ్యానించారు. 'మీరు ఎంత తిడితే.. కమలం అంతగా వికసిస్తుంది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో అందరూ చూశారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీకి ప్రజల మద్దతు లభించింది' అని అమిత్ షా స్పష్టం చేశారు.


'రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా యాత్ర చేసినప్పటికీ.. కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఒకప్పుడు ఈశాన్య ప్రాంతం కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించేవారు. ఇప్పుడు రాహుల్‌గాంధీ యాత్ర చేసినా ఇక్కడి ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. రాహుల్ గాంధీ విదేశీ నేలపై చేసిన విమర్శనాత్మక ప్రసంగాలను ప్రజలు గమనించారు. భవిష్యత్తులో కూడా రాహుల్ గాంధీ ఇదే పంథాను కొనసాగిస్తే.. దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం' అని అమిత్ షా జోస్యం చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa