కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ ఆదివారం ఉదయం అరెస్ట్ చేయడం సంచలనం మారింది. పులివెందులలో భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి కారులో హైదరాబాద్కు తరలించారు. భాస్కర్ రెడ్డి అరెస్ట్తో పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పట్టణంలో పోలీసులు ఎక్కడికక్కడ భారీగా మోహరించారు. భాస్కర్ రెడ్డి అరెస్ట్ క్రమంలో పులివెందులలో వ్యాపారులు స్వచ్చంద బంద్ పాటిస్తున్నారు. షాపులను మూసేసి బంద్ పాటిస్తున్నారు. భాస్కర్ రెడ్డి అరెస్ట్పై వైసీపీ నేతలు, కార్యకర్తలు పులివెందులలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. శాంతియుతంగా నిరసనలు చేపడుతున్నారు. దీంతో పులివెందులలో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు.
ఆదివారం ఉదయం 5 గంటలకు పులివెందులలోని భాస్కర్ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారుల బృందం చేరుకుంది. ఇంట్లో సోదాలు నిర్వహించి ఫోన్ను సీజ్ చేసింది. అనంతరం భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయన ఇంట్లోనే సీబీఐ అరెస్ట్ మెమోను తయారుచేసింది. అరెస్ట్ చేసినట్లు ముందుగానే ముందుగానే కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు అరెస్ట్ మెమోను భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మీకి అందజేశారు. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశామని, మధ్యాహ్నం సీబీఐ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని సీబీఐ అరెస్ట్ మెమోలో తెలిపింది.
సెక్షన్ 120 B,రెడ్ విత్ 302 , 302 ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని సీబీఐ ఇప్పటికే గుర్తించింది వివేకా హత్యకు ముందు, తరువాత నిందితులను భాస్కర్ రెడ్డి ఇంటికి పిలిచి మాట్లాడాడని సీబీఐ విచారణలో వెల్లడైంది. వైఎస్ లక్ష్మీ, పీ జనార్దన్ రెడ్డి ఇందులో సాక్షులుగా ఉన్నారు. 120b కుట్ర, 302 ముర్డర్ , 201 ఆధారాలు చెరిపివేయడం వంటి సెక్షన్ల కింద నమోదు చేశామని సీబీఐ పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa