కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి హైదరాబాద్ నుంచి కర్నూలు వస్తుండగా, మార్గమధ్యంలో టైరు పేలి కారు బోల్తా పడింది. బీచుపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదం ధాటికి ఆమె ప్రయాణిస్తున్న ఫార్చూనర్ వాహనం పల్టీ కొట్టి నుజ్జునుజ్జయింది. తీవ్ర గాయాలపాలైన నీరజారెడ్డిని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నీరజారెడ్డి తల, ఇతర శరీరభాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో, ఆమె చికిత్స పొందుతూ కన్నుమూశారు.
నీరజారెడ్డి ప్రస్తుతం ఆలూరు బీజేపీ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె విజయం సాధించారు. రెండేళ్లకే ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ ను వీడారు. 2019లో నీరజారెడ్డి వైసీపీలో చేరారు. అక్కడ ఇమడలేక బీజేపీలో చేరారు. ఇదిలావుంటే నీరజారెడ్డి భర్త పాటిల్ శేషిరెడ్డి గతంలోనే మరణించారు. ఆయన పత్తికొండ ఎమ్మెల్యేగా పనిచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa