మహిళ అదృశ్యంపై ఆమె భర్త త్రీ టౌన్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చోడవరం జూత్తడా ప్రాంతానికి చెందిన బోనేల సంతోష్ నాగేంద్ర కుమార్ 2011లో వివాహమైంది. 2017 అతడి బార్య మృతి చెందడంతో 2018లో సాలూరు కు చెందిన ఇందు అనే యువతి ని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు వున్నాడు. ఈక్రమంలో అతడి భార్య గత నెల 13న ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకునేందుకు సాలూరు వెళ్ళింది. మార్చి 24న ఆపరేషన్ జరిగింది. ఇదిలా వుండగా ఏప్రిల్ 9వ తేదిన తన భార్య విశాఖ మద్దిల పాలెం జంక్షన్ వద్దనున్న ఆమె సోదరి పాంచాలి నందిని ఇంటికి వెళ్లిందని ఈక్రమంలో ఈనెల 13 నా భార్య ఇందు కనిపించడం లేదంటూ ఆమే సోదర తనకు ఫోన్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వెతికిన ప్రయాజనం లేకపోవటంతో ఆదివారం త్రీ టౌన్ పోలీసు లకు ఫిర్యాదు చేసాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa