ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలువురు డీఎస్పీలను బదిలీ చేస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రామచంద్రపురంలో ఎస్డీపీవోగా పనిచేస్తున్న డి బాలచంద్రారెడ్డి టెక్కలి ఎస్డీపీవోగా బదిలీ అయ్యారు. కాకినాడ ఎస్బీ డీఎస్పీగా పనిచేస్తున్న ఎం అంబికా ప్రసాద్ రామచంద్రపురం ఎస్డీపీవోగా బదిలీ అయ్యారు. మార్కాపురం ఎస్డీపీవోగా పనిచేస్తున్న ఎం కిషోర్కుమార్ అమలాపురం ఎస్డీపీవోగా బదిలీపై వస్తున్నారు. అమలాపురం ఎస్డీపీవోగా పనిచేస్తున్న వై మాధవరెడ్డి మచిలీపట్నం ఎస్డీపీవోగా బదిలీ అయ్యారు. పోలవరం ఎస్డీపీవో పనిచేస్తున్న లతాకుమారి పెద్దాపురం ఎస్డీపీవోగా బదిలీపై వస్తున్నారు. గన్నవరం ఎస్డీపీవోగా పనిచేస్తున్న కే విజయపాల్ రాజమహేంద్రవరం సెంట్రల్ ఎస్డీపీవోగా బదిలీపై వస్తున్నారు. కందుకూరు ఎస్డీపీవోగా పనిచేస్తున్న కే శ్రీనివాసులు రాజమహేంద్రవరం సౌత్ ఎస్డీపీవోగా బదిలీపై వస్తున్నారు. రాజమహేంద్రవరం సౌత్ ఎస్డీపీవోగా పనిచేస్తున్న ఎం శ్రీలత కదిలి ఎస్డీపీవోగా బదిలీ అయ్యారు. చింతూరు ఏఎస్పీగా పనిచేస్తున్న కేవీ మహేశ్వరరెడ్డి రంపచోడవరం ఓఎస్డీగా బదిలీ అయ్యారు. రాహుల్మీనా చింతూరు ఏఎస్పీగా నియమితులయ్యారు. అలాగే గ్రేహౌండ్స్లో కమాండర్గా ఉన్న జగదీష్ హదహల్లి రంపచోడవరం ఏఎస్పీగా బదిలీ అయ్యారు. విజయనగరం దిశ డీఎస్పీగా ఉన్న ఎం వెంకటేశ్వర్లు రాజమహేంద్రవరం ట్రాపిక్ డీఎస్పీగా బదిలీపై వస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa