సీఎం జగన్ను నమ్ముకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. . సీఎంను నమ్ముకున్న కార్యకర్తలు రోడ్డున పడ్డారని.. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కారణమైన కార్యకర్తలను విస్మరించడం సరికాదన్నారు. శింగనమల నియోజకవర్గంలోని మండలాల్లో అధికారులు నియంతల్లా వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
యల్లనూరు మండలంలో 18 ఫ్యాక్షన్ గ్రామాలున్నాయని.. యల్లనూరు మండలంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది అన్నారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. ఈ ప్రభుత్వంలో సొంత పార్టీ కార్యకర్తలకే న్యాయం జరగడం లేదన్నారు. ఓ దళిత మహిళా ఎంపీపీని పరిగణనలోకి తీసుకోని పరిస్థితి ఉందని.. దళిత మహిళ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో దళితులకు ప్రాధాన్యత లేదన్నారు.
ఈ మండలంలో కొంతమంది నేతల సొంత ప్రయోజనాలు కోసం మళ్లీ ఫ్యాక్షన్ కక్ష్యలు రేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్లూరు, యల్లనూరు మండలాలతో సంబంధాలు ఉన్నా జోక్యం చేసుకోలేదని.. వర్గ విభేదాలు సృష్టించడం దారుణమన్నారు. కొందరు అధికారులు నియంతల్లా వ్యవహరిస్తున్నారని.. దంతలపల్లిలో ఫ్యాక్షన్ మొదలైతే లింగాల, సింహాద్రిపురం మండలాలకు చేరుతుందన్నారు.
శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం దంతలపల్లిలో పెద్దారెడ్డి, బోగాతి నారాయణరెడ్డి వర్గీయుల మధ్య గొడవ జరిగింది. ఉపాధి పనుల విషయంలో వివాదం రేగగా.. రెండు వర్గాలు వాగ్వాదానికి దిగారు. ఈ గొడవల్లో ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరుడు, బోగాతి నారాయణరెడ్డి వర్గీయుడు గాయపడ్డారు. ఈ ఘర్షణపై ఇరువర్గాలు ఒకరిపై మరొకరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ విషయం తెలియడంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆ ఊరికి వెళ్లారు.
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గానికి చెందిన వారిపై 307 కేసు నమోదయ్యాయి. బోగతి నారాయణరెడ్డి వర్గంపై 147,148,149,324-ipc బెయిల్ బుల్ సెక్షన్ ల కింద నమోదు చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి వర్గంపై147,148,149,307,324 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. తమ వర్గంపై 307 సెక్షన్ పెట్టడంపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అభ్యంతరం తెలుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa