వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం జనసేన కృషి చేస్తుందని, తమ నినాదం కూడా అదేనని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. హైదరాబాదులో నిన్న టీడీపీ అధినేత చంద్రబాబును జనసేనాని పవన్ కల్యాణ్ కలవడం తెలిసిందే. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వైసీపీ ప్రభుత్వ విధానాలపై పోరాటం తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ భేటీ నేపథ్యంలో, నాదెండ్ల మనోహర్ స్పందించారు.
రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఇరువురి భేటీ అవశ్యం అని అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు మధ్య భవిష్యత్తులో మరిన్ని సమావేశాలు ఉంటాయని తెలిపారు. రాబోయే ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నామని వెల్లడించారు. నిన్న చంద్రబాబుతో భేటీలో తమ అజెండా అదేనని వివరణ ఇచ్చారు. సరైన ప్రణాళిక, వ్యూహంతో జనసేన ముందుకు కదులుతోందని నాదెండ్ల పేర్కొన్నారు.
సీఎం జగన్ పట్ల ప్రజల్లో నమ్మకం పోయిందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలమయ్యాయని విమర్శించారు. విశాఖలో భూ దందాలపై జనసేన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa