ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీళ్ళు కలిస్తే మీకేంటి ప్రాబ్లెమ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 01, 2023, 12:25 PM

టీడీపీ అధినే త చంద్రబాబు, జనసేన అధినేత పవన కల్యాణ్‌ బేటీ అయితే వైసీపీ నాయకులకు ఉలుకెందుకని జనసేన రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రాందాస్‌చౌదరి పేర్కొ న్నారు. మదనపల్లె పట్టణంలోని కమ్మవీధి లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ పవన శనివారం చంద్రబాబును కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారని దీన్ని చూసి జీర్ణిం చుకోలేని వైసీపీ నాయకులు ఉలికిపాటుకు గురయ్యారన్నారు. కడప-బెంగ ళూరు, వయా మదనపల్లె రైలు మార్గం, అన్ని వసతులు, అర్హతలున్న మదనపల్లెను జిల్లా కేంద్రం చేయడంలో వైసీపీ నాయకులు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబ ట్టారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధించి జెండా ఎగుర వేస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గ్రానైట్‌ బాబు, సనావుల్లా, జగదీష్‌, రెడ్డెమ్మ, రెడ్డెప్ప, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa