పొత్తులపై చర్చ జరుగుతోన్న సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. మూడు ప్రధాన పార్టీలు కలసి వచ్చే ఎన్నికల్లో పనిచేయనున్నాయని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్-చంద్రబాబు, చంద్రబాబు-ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్-ప్రధాని భేటీల ఉద్దేశమన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే బ్రాండ్ ను పూర్తిగా చెడగొట్టారని.. స్వయంగా ఆయన కుటుంబ సభ్యులే విమర్శించారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసు, కోడి కత్తి కేసుల్లో నిందితులు ఎవరో అందరికీ తెలిసిపోయిందన్నారు. గతంలో తాము వివేకాను తాను, బీటెక్ రవి చంపినట్లు దుష్ప్రచారం చేశారన్నారు. అలాగే 2019 ఎన్నికల్లో లబ్ధి పొందారన్నారు.
వైఎస్ వివకేకా కుమార్తె, అల్లుడికి సంబంధం లేదని కోర్టులు తేల్చాయని.. ఇక వేళ్లన్నీ అవినాష్రెడ్డి వైపే చూపిస్తున్నాయి అన్నారు. ముందస్తు బెయిల్ ప్రయత్నాలు విఫలమైనందున తర్వాత జరిగేది అరెస్టే అన్నారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు అన్నారు. తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటానని చెప్పారు ఆదినారాయణరెడ్డి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa