ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్‌ కళ్యాణ్‌ ఓ అజ్ఞాని..అంబటి రాంబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 02, 2023, 07:52 PM

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఓ అజ్ఞాని అని.. ఆయన చంద్రబాబుతో కలిసినా కాపులు వారి కలవబోరని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కాపులను సర్వనాశనం చేయడమే టీడీపీ లక్ష్యమన్నారు. పవన్‌ కల్యాణ్‌కు అసలు చరిత్రే తెలియదని.. అందుకే కాపులతో చంద్రబాబు పల్లకీ మోయించాలని చూస్తున్నారని ఫైరయ్యారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని కాపులను చంద్రబాబుకు తాకట్టు పెట్టాలని పవన్‌ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ వైఖరి పట్ల కాపులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒక పార్టీలో ఉండి వేరే పార్టీ వారితో కలవడం పవన్‌ కళ్యాణ్‌కు అలవాటే అని అన్నారు. కాపులను అణచివేసిన పార్టీ టీడీపీ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. గతంలో తనపై కూడా కేసు పెట్టారని.. అయితే, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపులపై పెట్టిన కేసులు కొట్టేశారని అంబటి రాంబాబు గుర్తు చేసుకున్నారు. టీడీపీ హయాంలో నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభంను, ఆయన కుటుంబ సభ్యులను చిత్రవధ చేశారన్నారు. ఆనాడు కాపులపై అక్రమంగా పెట్టిన 69 కేసులను సీఎం జగన్ కొట్టేశారని వివరించారు.


తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ప్రభుత్వ హయాంలో కాపులపై అనేక కేసులు నమోదు చేశారని ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తుని రైలు దహనం కేసులను కొట్టివేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన అనుకూల మీడియా భరించలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో కాపులను హింసించారని తెలిపారు. కాపు ఉద్యమంలో పాల్గొన్న నాయకులందరిపై చంద్రబాబు 69 కేసులు పెట్టించారని మండిపడ్డారు.


గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తుని రైలు దహనం కేసులో ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా సహా అనేక మందిపై అక్రమ కేసులు ట్టారని అంబటి రాంబాబు అన్నారు. ఆ కేసు విచారణలో నేరాన్ని నిరూపించ లేకపోయారన్న కారణంతో కాపులపై అన్యాయంగా పెట్టిన కేసులను కోర్టు కేసు కొట్టివేసిందని.. ఇది హర్షించదగ్గ పరిణామమన్నారు.


రాజకీయ కక్షతోనే ఆనాడు చంద్రబాబు కేసులు పెట్టించారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇక, చంద్రబాబు ప్రోద్బలంతోనే వంగవీటి మోహన రంగా హత్య జరిగిందన్నారు. చంద్రబాబు హయాంలో కాపులపై పెట్టిన అన్ని కేసులను కేవలం ఒకే ఒక్క జీవోతో సీఎం జగన్‌ ఎత్తివేశారన్నారు. ఇదే సమయంలో, కాపులను హింసంచడమే టీడీపీ పని అని అన్నారు. టీడీపీ కాపు వ్యతిరేక పార్టీ అని.. వారి విషయంలో చంద్రబాబు సైకోలా వ్యవహరించారని మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇక, తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కామెడీగా మాట్లాడతారని.. ఆ కామెడీలకు తానేం సమాధానం చెబుతానని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టును మల్లారెడ్డి కట్టాల్సిన అవసరం లేదని.. నీళ్ల దగ్గర తగాదా పెట్టకుండా మా వాటా మాకు ఇప్పిస్తే చాలన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa