జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారని.. అయినప్పటికీ సాక్షి అల్ప జీవులు ఇష్టనుసారంగ రాసుకున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్పై సాటి కులస్థులతో మాట్లాడిస్తారన్నారు. సందేహం లేకుండా పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం ఉండకుడదు అని చెప్పారని తెలిపారు. పవన్ కళ్యాణ్ అద్భుతంగా చెప్పారని.. ఎన్ని పోటీ చేశమనేది కాదు... ఎన్ని నెగ్గాము అనేది అవసరమన్నారు. రాష్ట్రానికి ఒక తెగులు పట్టిందన్నారు. ప్రధాన ప్రతిపక్ష పక్షాలు రెండు పార్టీలు కలిశాయని.. బీజేపీని కూడా తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి కన్ఫ్యూజన్లో పడ్డారన్నారు. జగన్ నన్ను ఎదుర్కోవడానికి ఒక్కొక్కరు రావాలని అంటున్నారని.. రాక్షసత్వంలో జగన్ మించిన వారు ఎవరు లేరని వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ పేరు జనసేనా , కుల సేనా కాదు.. ఆయనను ఒక కులానికి పరిమితం చేయొద్దన్నారు. జగన్ వేసే చిల్లర మెతుకులకు ఆశపడి మాట్లాడే వారు ఉన్నారని మండిపడ్డారు. నలుగురు చిల్లర వెధవలు అన్ని పార్టీలో ఉన్నారన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజల నాయకుడని ఎంపీ రఘురామకృష్ణ రావు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa