స్నేహితుడి మృతదేహంపై కూర్చుని ఓ అఘోరా పూజలు చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కోయంబత్తూరు జిల్లా సూలూర్ వద్ద ఆదివారం జరిగిన ఈ ఘటనపై తీవ్ర కలకలం రేపింది. కురుంబపాళెయానికి చెందిన అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తోన్న మణికంఠన్ అనే యువకుడికి రెండేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజుల నుంచే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో ఇరువురి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన మణికంఠన్ ఆదివారం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషయం తిరుచ్చికి చెందిన అతడి చిన్ననాటి మిత్రుడికి తెలిసింది. ప్రస్తుతం అఘోరాగా ఉంటున్న అతడు.. మరి కొంత మంది అఘోరాలతో కలిసి సూలూర్కి వచ్చి మణికంఠన్ అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. స్నేహితుడి మృతదేహంపై కూర్చుని పూజలు చేశాడు. బలవన్మరణానికి పాల్పడిన మణికంఠన్ ఆత్మకు శాంతి చేకూరాలనే ఈ విధంగా చేసినట్టు చెబుతున్నారు.
మణికంఠన్ కుటుంబసభ్యులు అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా.. అతడి మిత్రుడు అఘోరాలతో కలిసి వచ్చి ఆత్మశాంతి కోసం చేయాలని చెప్పాడు. అందుకు కుటుంబసభ్యలు అంగీకరించడంతో పూజలు మొదలుపెట్టారు. మిత్రుడి మృతదేహంపై ఓ అఘోరా పద్మాసనంలో కూర్చుని ధ్యానం చేస్తూ ఏవో మంత్రాలు జపించాడు. పెద్దగా కేకలు వేస్తూ.. పూజలు చేస్తుండగా అతడి అనుచరులు ఢమరుకం వాయిస్తూ, శంఖం ఊదుతూ వింత శబ్దాలు చేశారు.
దీనిని చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కొందరు ఆందోళన వ్యక్తం చేయగా.. మరికొందరు చనిపోయిన వ్యక్తిపై కూర్చుని ఈ పూజలేంటని అక్కడికి వ వింతగా చూశారు. చనిపోయిన మిత్రుడి శవంపై కూర్చుని పూజలు చేస్తే వారికి ఆత్మశాంతి కలుగుతుందా? అఘోరా చేసిన పూజ సంచలనం రేపుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa