పూజల పేరుతో మరో మోసం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లాకు చెందిని ఓ మహిళ ఇంట్లో ప్రమాదవశాత్తు దేవుడి ఫోటోలు కాలిపోయాయి. దీన్ని అపశకునంగా భావించిన సదరు మహిళ.. గురూజీ నరసింహారావును ఆశ్రయించారు. ఇంట్లో పూజలు చేయాలంటూ ఇరవై ఎనిమిది వేలను మహిళ నుంచి గురూజీ వసూలు చేశాడు. అనంతరం పరిచయం పెంచుకొని మహిళా బలహీనతను ఆసరాగా తీసుకుని ఆ గురూజీ ఏకంగా బంగారం తాకట్టు పెట్టించి మరీ రూ.13 లక్షలను మహిళ నుంచి వసూలు చేశాడు. తన డబ్బులు తనకు ఇవ్వాలని మహిళ అడుగగా గురూజీ అసలు రూపం బయటపడింది. డబ్బులివ్వకుండా వేధించడమే కాకుండా మహిళను గురూజీ, అతని అనుచరులు కలిసి లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమెపై ఎస్సీ ఎస్టీ కేసు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో చివరకు బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించి గురూజీ వ్యవహారాన్ని తెలియజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa