వైసీపీ పాలనలో రా ష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు విలవిల్లాడుతున్నారని జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం కడప జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన వారాహి యాత్రకు సంబంధించి పోస్టర్లను వా రు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, కడప అసెంబ్లీ ఇన్చార్జ్ సుంకర శ్రీనివాస్, రాజంపేట జనసేన నాయకులు అతికారి దినేష్ మాట్లాడుతూ ఒక్క చాన్స్ అని ఓటు వేయించుకుని గద్దెనెక్కిన జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో ఇసుక మాఫియా, భూ కబ్జాలకు తెరలేపారన్నారు. అధికారం చేపట్టి నాలుగేళ్లయినా పోలవరం పూర్తి అయింది లేదని, జాబ్క్యాలెండరు విడుదల చేసిందీ లేదన్నారు. అలాగే ఉద్యోగుల సమస్యలు తీర్చలేదన్నారు. వైసీపీ మంత్రులు ఏ ఒక్కరికీ వారి శాఖల మీద అవగాహన లేదన్నారు. రైతులను ఆదుకొనిందీ లేదన్నారు. ఈ క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం వారాహి యాత్ర మొదలుపెట్టనున్నారన్నారు. ఈ నెల 14న అన్నవరం నుంచి భీమవరం వరకు యాత్ర ఉంటుందని, ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభ ఉంటుందని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa