ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూరీ జగన్నాథుడి రథయాత్రలో పాల్గొన్న కేంద్రమంత్రులు

national |  Suryaa Desk  | Published : Tue, Jun 20, 2023, 10:45 PM

పూరీలో జగన్నాథుని రథయాత్ర మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు లక్షల్లో తరలిరావడంతో పూరీ మొత్తం ఆధ్యాత్మికంగా మారింది. రథోత్సవంలో భాగంగా రథంపై జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన విగ్రహాలను ప్రతిష్ఠించారు. అనంతరం మంగళ హారతి నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. మంగళవారం ఉదయం పూరీకి చేరుకుని పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి ఆశీస్సులు అందుకున్నారు.


 









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa