ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ ఎంపీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 21, 2023, 10:54 AM

 విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జపించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కె.నారాయణ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశానన్నారు. ఎంపీ ఇంట్లోకి దుండగులు ప్రవేశించి రోజుల తరబడి అక్కడే ఉండి గంజాయి, మాదక ద్రవ్యాలు వాడారని, దుండగులకు ఎంపీ సత్యనారాయణకు మధ్య చాలా వ్యవహారాల్లో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోకూడదని నారాయణ అన్నారు. కిడ్నాప్‌ వ్యవహారాన్ని వైసీపీ ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందని, దీనిని సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa