ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరాచకాలకు అడ్డాగా రాష్ట్రము తయారైనది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 21, 2023, 10:54 AM

విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్‌ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఏపీ అరాచకాలకు అడ్డాగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మాట్లాడారు. విశాఖ ఎంపీ కుటుంబాన్ని బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారని, ఇది వందల కోట్ల భూములకు సంబంధించిన వ్యవహారమని పేర్కొన్నారు. కాగా, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణే తన వ్యాపారాన్ని హైదరాబాద్‌కు తరలిస్తానంటే ఇక బయట రాష్ట్రాల వారు ఇక్కడికి ఎలా వస్తారో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నవారు చెప్పాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్ర మోహన్‌ డిమాండ్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa