పాత పెన్షన్ పునరుద్ధరణే లక్ష్యంగా జూలై 8వ తేదీన పాత ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించామని, సీపీఎస్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం (ఏపీసీపీఎ్సఈఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తానని చెప్పిన జీపీఎ్సను నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గతంలో ప్రతిపక్ష నేతగా మొత్తం 109 సార్లు బహిరంగ వేదికలపై సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తెస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. మేనిఫెస్టోలో కూడా చేర్చారని.. మేనిఫెస్టో తనకు ఖురాన్, బైబిల్, భగవద్గీతలతో సమానమని జగన్ చెప్పటంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సీపీఎస్ ఉద్యోగులు ఆయనకు అధికారాన్ని కట్టబెట్టడంలో కీలకపాత్ర పోషించామన్నారు. అధికారంలోకి వచ్చాక పాత పెన్షన్ పునరుద్ధరణ ఊసు మరిచి జీపీఎస్ అంటున్నారని... పాత పెన్షన్ పునరుద్ధరణ తప్పితే తాము ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని అంగీకరించేది లేదని చెప్పారు. ప్రభుత్వ తీరుపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ క్రమంలో సీపీఎస్, జీపీఎస్ రద్దు చేయటానికి తమ పోరాటంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa