ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీని ఇంటికి పంపడమే మా లక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 21, 2023, 10:57 AM

వైసీపీ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించడానికే జనసేన అధినేత పవనకళ్యాణ్‌ పోరాటం చేస్తున్నారని జనసేన నాయకుడు మైఫో ర్సు మహేష్‌ పేర్కొన్నారు. కడప జిల్లా, మదనపల్లె , గొల్లపల్లెలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ .... రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను ఎదురించేందుకే పవనకళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపించేలా వారాహి యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. జనసేనాని ప్రజల పక్షాన పోరాడుతూ సొంతనిధులతో ఎన్నో సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల మనసు గెలుసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిక, సునీత, సందీప్‌, శ్రీనాథ్‌, రుమణ, బాషా, షమీ, దేవా, అసిఫ్‌, రేవంత, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa