రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి, ఈ నాలుగేళ్ల వైసీపీ పాలనలో దౌర్జన్యాలు, అవినీతి అక్రమాలను బస్సుయాత్ర ద్వారా ప్రజలకు తెలియజేద్దామని మాజీ మంత్రి పరిటాల సునీత పార్టీ శ్రేణులతో అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే బస్సుయాత్ర 29న రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఈ నేపథ్యంలో కనగానపల్లిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆమె సమావేశం నిర్వహించారు. బస్సుయాత్ర రూట్ మ్యాప్ను వివరించారు. ఈ నెల 29న రామగిరి మండలం పేరూరు నుంచి యాత్ర ప్రారంభమై, కనగానపల్లి మీదుగా రాప్తాడు వరకు కొనసాగుతుందని తెలిపారు. రాప్తాడులో రచ్చబండ, పల్లెనిద్ర నిర్వహిస్తామని అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను జనంలోకి తీసుకెళ్లే విధంగా బస్సుయాత్ర ఉంటుందని అన్నారు. యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. స్థానిక నాయకులు చొరవ తీసుకుని యాత్రను విజయవతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ యాతం పోతలయ్య, రాష్ట్ర కార్యదర్శి నెట్టెం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa