ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుమానాస్పదంగా యువకుడు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 21, 2023, 11:00 AM

శ్రీకాకుళం జిల్లా, హరిశ్చంద్రపురం రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రైలు కింద పడి సరియాపల్లి గ్రామానికి చెందిన చల్ల సింహాచలం (27) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సింహాచలం నాలుగేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ ఏడాది కిందటే అనకాపల్లి జిల్లాలోని మరో కంపెనీకి వచ్చాడు. రెండునెలల కిందటే ఇంటికి వచ్చి వెళ్లాడు. అయితే ఏం జరిగిందో గాని మంగళ వారం తెల్లవారుజామున రైలు పట్టాల మధ్య విగతజీవిగా కనిపించాడు. జేబులో ఉన్న ఆధార్‌ కార్డు ఆధారంగా జీఆర్‌పీ అధికారులు ఆయన కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్‌పీ హెచ్‌సీ రమేష్‌ తెలిపారు. సింహాచలానికి తండ్రి నారాయణరావు రెండేళ్ల కిందట మృతి చెందగా తల్లి చిన్నమ్మడు, తమ్ముడు లోకేష్‌ ఉన్నారు. ఆయన మృతితో సరియాపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa