ప్రజల అవసరాలను తీర్చుటకై రూపొందించిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిషనర్ దినేష్కుమార్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం వేంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో మంగళవారం జరిగిన అవహన కార్యక్రమంలో ఆయన మాట్లా డారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు లేక కొంతమంది అర్హుత పొందలేకపోతున్నారన్నారు. అన్ని రకాల ధ్రువపత్రాలు, ప్రభుత్వ సేవలు అందించడానికి వచ్చే నెల 1నుంచి వారంలో 3 రోజుల చొప్పున 5 వారాలు పాటు వార్డు, సచివాలయాల వద్ద నిర్దేశించిన రోజుల్లో శిబిరం నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో వలంటీర్లు కీలక పాత్ర వహించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పీఎం.సత్యవేణి, డిప్యూటీ కమిషనర్ జి.సాంబశివరావు, ఎంహెచ్వో డాక్టర్ వినూత్న, అర్బన్ తహశీల్దార్ సుస్వాగతం తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa